Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » October 2012
తెలుగు భాషకు పూర్వవైభవం తెస్తాం: వట్టి

తెలుగు భాషకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వట్టి వసంత్ కుమార్ తెలిపారు. తెలుగు భాషపై తల్లిదండ్రుల ఆలోచన దారి మళ్లిందని, ఇంగ్లీష్ భాషపై మోజు పెరిగిందని ఆయన అన్నారు. తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సమీక్షించింది. తిరుపతి అవిలాల చెరువు సమీపంలో ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ చివరివారంలో మూడు రోజుల పాటు జరగనున్నాయి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ,భారత జాతి చరిత్రకి ప్రత్యేకమయిన గుర్తింపు ఉందని,అందులో తెలుగువారి చరిత్ర 3 వేల సంవత్సరాల కిందటదని బ్రిటన్ విదేశాంగ శాఖా దక్షిణాసియా సహాయ మంత్రి అలిస్టర్ బెర్ట్ అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ

1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టుల తో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది. 1953 డిసెంబర్‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. 1955 సెప్టెంబర్ 30 న తన నివేదిక సమర్పించింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు విశాలంధ్రకు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండిపోయారు. విశాలాంధ్రను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణా రావు, మాడపాటి హనుమంతరావు, స్వామి రామానంద తీర్థ మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున బూరుగుల రామకృష్ణా రావు, కె.వి.రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.), మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు పాల్గొనగా, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 19 న వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.1956 నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన సి.ఎం.త్రివేది, ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.

భారత జాతి చరిత్రకి ప్రత్యేకమయిన గుర్తింపు ఉందని,అందులో తెలుగువారి చరిత్ర 3 వేల సంవత్సరాల కిందటదని బ్రిటన్ విదేశాంగ శాఖా దక్షిణాసియా సహాయ మంత్రి అలిస్టర్ బెర్ట్ అన్నారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఆంధ్రను తమిళనాడులో కలపాలి: టిఆర్ఎస్ నేత వినోద్

దేశ సమగ్రత కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వద్దని చెబుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అదే సమగ్రత కోసం తమిళనాడులో కలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ సూచించారు. తమిళనాడు నుండి వారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు డిమాండ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వారు డిమాండ్ చేసిన తరహాలోనే మేమూ డిమాండ్ చేస్తున్నామని అందులో తప్పేముందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు ఏర్పడినాయని చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు.

పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దేశంలో గోవా వంటి కృష్ణా జిల్లా కంటే చిన్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నేతల మాదిరి కృష్ణా జిల్లా నేతలమంతా రాజీనామాలు చేస్తే ప్రత్యేక కృష్ణా రాష్ట్రాన్ని ప్రకటిస్తారా అని కావూరి హేళన చేయడం సరికాదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mudellu aina chekkuchedarani mruthadeham - మూడేళ్లయినా చెక్కుచెదరని మృతదేహం

మూడేళ్లయినా చెక్కుచెదరని మృతదేహం

బ్రహ్మంగారిమఠం, మార్చి 10 : కాలజ్ఞాన కర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయిన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో గురువారం ఓ వింత జరిగింది. సాధువుగా జీవనం సాగిస్తూ మూడేళ్ల క్రితం చనిపోయిన వెంకటయ్య మృతదేహం సమాధిలో మూడేళ్ల తర్వాత కూడా చెక్కు చెదరలేదు. ఆయన నిర్మించిన ఆశ్రమంలోనే మూడేళ్ల క్రితం సమాధి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత బంధువులు ఆశ్రమాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశ్రమాన్ని కూలదోస్తూ ఎక్స్‌కవేటర్‌తో చదరం చేస్తున్నపుడు గురువారం సాధువు వెంకటయ్య మృతదేహం సమాధి నుంచి బయటపడింది.

మృతదేహాన్ని బద్వేలు ప్రాంతానికి బంధువులు తరలిస్తుండగా గమనించిన నర్సన్నపల్లె గ్రామస్థులు ఆశ్రమాన్ని కూల్చివేసిన వారికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. మూడేళ్లయినా మృతదేహం చెక్కు చెదరకుండా ఉండడంతో స్థానిక ప్రజలు పూజలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు భారీగా సంఘటనా స్థలానికి తరలి వచ్చి వెంకటయ్య మృతదేహాన్ని చూసి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దారు సాయినాథ్ , బి.మఠం ఎస్ఐ రామచంద్రయ్య గ్రామస్తులతో చర్చించి సాధువు వెంకటయ్య మృతదేహాన్ని యధా స్థానంలోనే మళ్లీ సమాధి చేశారు.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం వీక్షకులకు మరియు అందరికి దసరా (విజయ దశమి) శుభాకాంక్షలు.-m&k

భారతీయులం వీక్షకులకు మరియు అందరికి దసరా (విజయ దశమి) శుభాకాంక్షలు.-m&k

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఇక దసరా పండుగ ఎలా ఉంది అంటే.. వారి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి!!

బంధువుల ప్రయాణాలూ భారం.. ఇళ్లలో సందడే లేని వైనం
వాన చినుకు చాలలేదు.. కరెంటు అసలే రాదు.. మోటారు నడవదు.. పైరుకు నీరు పారదు.. పొలం ఎండిపోతోంది.. పెట్టుబడి మట్టిలో కలిసిపోతోంది.. కొండచిలువలా అప్పు కళ్లెదుట కనిపిస్తోంది.. రైతు గుండె అవిసిపోతోంది! ఎండుతున్న పొలంలో కూలీకి పని లేదు.. పని లేకపోతే కూలీ లేదు! కరెంటు కోతలతో మిల్లులు మూతపడ్డాయి.. పరిశ్రమలు నిలిచిపోయాయి.. కార్మికులకు దినసరి వేతనాలూ కరువయ్యాయి! పెద్ద రైతూ.. చిన్న రైతూ.. రైతు కూలీ.. కార్మికులు... ఎవరి చేతిలోనూ పైసా లేదు! అందరిలోనూ కొండంత దిగులు గూడుకట్టుకుంది! అందరి ఇంటా పూట గడవటమే కనాకష్టంగా మారింది! 

ఇక దసరా పండుగ ఎలా ఉంది అంటే.. వారి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి!! 


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mughal times one rupee note and ten rupees note

ముగ్హల్ నాటి పది రూపాయి నోటు. & ముగ్హల్ నాటి ఒక రూపాయి నోటు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

meeku telusa ? hyderabad kuda oka pratyeka rastram okaapudu...mughal vaari kalam lo chala alochanalanu amaluparicharu

మీకు తెలుసా ?
హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రము ఒక్కప్పుడు, ముగ్హల్ వారి పాలన లో హైదరాబాద్ ని ప్రత్యేకంగా చేయాలన్నదే వారి ఆకాంక్ష ! అందుకోసం వారు చాలా నియమాలు అమలుపరిచారు.
మరి ఈనాడు విదిపోదాము అని చేస్తున్న కొన్ని రాజకీయనాయకుల మాటలు విన్నాక, చార్మినార్ దెగ్గర ఉన్న ఒక పార్టీ అందరు ఏకం అయ్యి మరి హైదరాబాద్ ని కూడా ప్రత్యేక రాష్ట్రము చేయండి విడిపోయే ఉద్దేశం ఉంటె అని కోరారు శ్రీ కృష్ణ కమిటీ కి వినతి పత్రం కూడా అందచేసారు అంట.
అయినా ఇప్పుడు మన చుట్టూ ఉన్న రాజకీయనాయకులు ఎందుకు హైదరాబాద్ మాకు కావలి అంటూ ఒకరిమీద ఒకరు గొడవలకు దిగుతున్నారు ?
హైదరాబాద్, ఇది ఒక భారి పెట్టుబడుల స్థలం మరియు రాబడి కూడా ఎక్కువే,ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్తున్నది హైదరాబాద్ వివిధ కంపెనీలు బారి పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు మరి ఇలాంటి బంగారు బాతు గుడ్డు పెట్టె హైదరాబాద్ ఎవరికీ వొద్దు. అటు అభివ్రుది మరియు బోలెడు డబ్బులు తెచిపెట్టే ఈ హైదరాబాద్ అందరికి కావలి కదా అదే ఇప్పుడు అసలు సమస్య ఇటు అన్ని రాజకీయ పార్టీల అందరి గొడవ భాతు గుడ్డు ని వదులు కోలేక మరియు తమ పెట్టుబడులు లో పెట్టిన డబ్బులు పోతాయి అని మరి కొందరు.
యూనియన్ టెర్రిటరీ చేయడానికి హైదరాబాద్ ని చేయడం తప్ప మరో ఆలోచన ఇప్పటి ప్రభుత్వం దెగ్గర లేదు. అటు ఒక ప్రాంతం వారిని కించపరచకుండా ఒకరు తక్కువ కాదు మరొకరు ఎక్కువ కాదు...ఈ రాజకీయనాయకులు తమ స్వార్ద ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలకు ఎదురు చెప్పేలా.
జనాలకి ఉపయోగ పడే పనులు చేసి రాజకేయనాయకులు అనే పదానికి విలువ పెంచండి. నాయకుడి లక్షణాలు అంటే ఏంటో తెలుసుకోండి మరియు జనాల్లో నమ్మకాన్ని పెంచండి డబ్బులు కోసం నమ్మకాని తాకట్టుపెట్టుకోకండి మరియు అమ్ముడుపోకండి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

సెక్షన్ 498ఎ దుర్వినియోగం,రెండు వేర్వేరు కుటుంబాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను దాంపత్యబంధంతో ఒకటిగా చేసినా, కొందరి విషయంలో కడ దాకా అది నిలుస్తుందని చెప్పలేం.

సెక్షన్ 498ఎ దుర్వినియోగం
============
రెండు వేర్వేరు కుటుంబాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇద్దరు
వ్యక్తులను దాంపత్యబంధంతో ఒకటిగా చేసినా, కొందరి విషయంలో కడ దాకా
అది నిలుస్తుందని చెప్పలేం.
వివాహ బంధంలో నీవు, నేను- అనే
అహంభావాన్ని వదిలి మనం, మన కుటుంబం- అని భార్యాభర్తలిద్దరూ
సర్దుకుపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వివాహం విజయవంతం అవుతుంది.
ఈ విజయంలో అబ్బాయి కుటుంబం, అమ్మాయి కుటుంబంలోని సభ్యులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మొదలయ్యే చిన్న చిన్న
గొడవలు తీవ్రం కాకుండా చేయడం పెద్దల బాధ్యత. అది అన్నివేళలా సాధ్యం
కాకపోవచ్చు. భర్త, అత్తింటివారు
అమ్మాయిని బాధ పెడుతున్నారు, కట్నం చాలదంటూ హింసిస్తున్నారని తరచూ వింటుంటాం. గృహహింస, వరకట్న బాధితులైన స్ర్తిల కోసం భారత రాజ్యాంగంలో వరకట్న నిషేధ చట్టంలో సెక్షన్ 498ఎ ఏర్పాటు చేశారు. కట్నం కోసం వేధించే భర్త, అత్తింటివారి మీద బాధిత మహిళ ఈ సెక్షన్ ప్రకారం కేసు వేసి న్యాయ పోరాటం చేయవచ్చు.
కాగా, వివాహిత మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ చట్టం మరెంతో మంది అమాయక మహిళల, కుటుంబ సభ్యుల వేధింపులకు కూడా కారణమవుతోందన్న వాదనలు లేకపోలేదు. అందరు అత్తలూ మంచివారు కానట్టే అందరు కోడళ్లూ మంచివాళ్లు కారు. తమకు అనుకూలంగా లేనప్పుడు- భర్త, అత్తింటివారు, చివరికి ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడుచులు కూడా తమను వేధిస్తున్నారంటూ కొం దరు కోడళ్లు ఈ చట్టం అండతో కేసుల్లో ఇరికిస్తున్న ఉదంతాలున్నాయ. ఒక్క ఉత్తరం ముక్కతో పోలీసులు కూడా న్యాయ విచారణ లాంటివేమీ లేకుండా తక్షణమే ఆ కంప్లెయింట్లో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏ పాపమూ తెలియని ఆ కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకోకుండా అవమానాల పాలవుతున్నారు. ఇక ఆ కేసు తేలేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఖర్చు కూడా తక్కువేమీ కాదు. చివరికి కంప్లెయింట్ ఇచ్చిన మహిళ కోరినట్టుగా ఆస్తిపాస్తులు రాసి ఇచ్చి, రాజీ పడక తప్పడం లేదు. ఇలా అమాయకులైన వారిని తప్పుడు కేసులలో ఇరికించి బాధపెట్టడం అనేది ఈ మధ్య ఎక్కువగా వినపడుతోంది. పోలీసులు, న్యాయస్థానాలు కూడా కంప్లెయింట్ ఇచ్చిన మహిళ మాటలనే నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇటువంటి తప్పుడు కేసుల వల్ల తమ పరువు పోతోందని బాధితులు వాపోతున్నారు. వరకట్న నిషేధ చట్టం ఐపిసి 498ఎ కింద నమోదు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు ఎనభై శాతం తప్పుడు కేసులే అంటున్నారు పరిశోధకులు. భర్తను, అత్తింటివారిని డబ్బుల కోసం అన్యాయంగా వేధించడం తప్ప ఇతరత్రా కారణాలేమీ ఉండడం లేదు. సుప్రీంకోర్టు కూడా దీనిని 'చట్టపరమైన ఉగ్రవాదం'- అని పేర్కొంది. డబ్బుకోసమో, వేరు కాపురం పెట్టడానికో, చిన్న చిన్న విషయాల్లో భర్తలతో గొడవకు దిగి సమన్వయలోపంతో విచక్షణ కోల్పోయి ముసలివారు, పేదవారు అని కూడా చూడకుండా అమాయకులైన అత్తామామల మీద, భర్తమీద ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇరికిస్తున్న కోడళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిని వదిలించుకుందామన్నా వీలుకాని పరిస్థితి. అరెస్ట్ అయన తర్వాత విడుదలై వచ్చినా కేసు తేలేవరకు కోడలి బెదిరింపులు తప్పవు. కోడలు ఎప్పుడేం చేస్తుందో? అని అత్తింటివారు అనుక్షణం భయపడుతూ ఉండాలి. కాగా, ఇటీవల ఒక కేసు విషయమై ముంబై హైకోర్టు- ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వం కిందవస్తుందని తీర్పునిచ్చింది.
ముంబైకి చెందిన సంతోష్, రేఖ (పేర్లు మార్చాం) దంపతులు. వీరి మధ్య గొడవలు, మనస్పర్థలు పెరగడంతో రేఖ తన భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టి అతడిని, అతడి కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్టు చేయంచింది. సంతోష్ చెప్పిన వివరాల ప్రకారం- అతని భార్య చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నమ్ముతూ కింది కోర్టు కేసు కొట్టేసింది. ఆ తర్వాత సంతోష్ తన భార్య నుండి విడాకులు కోరుతూ పూణేలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అతడి వాదనను తోసిపుచ్చింది. చివరకు సంతోష్ ముంబై హైకోర్టులో అప్పీల్ చేయగా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, ఇతర ఆధారాలను పరిశీలించిన జస్టిస్ వి.ఎం.కనాడే, పి.డి.కొడేలతోకూడిన ధర్మాసనం, తప్పుడు కేసులు పెట్టి వేధించడం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) ప్రకారం క్రూరత్వం కింద పరిగణించాల్సి వస్తుందని పూణే కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి అతనికి విడాకులు మంజూరు చేసింది. ఇక భర్త, అత్తగారి వైపు బంధువులను వేధింపు కేసులతో సతాయించే కోడళ్ళకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుందేమో! తప్పుడు కేసులు పెట్టడం- తప్పే కాదు, అది క్రూరత్వం అని న్యాయస్థానమే తీర్పునిచ్చింది.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

సాగు బడి లో సాంకేతిక పాటాలు

సాగు బడి లో సాంకేతిక పాటాలు

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

గుప్పెడు మెతుకులు దొరకని జీవితం..! కొందరు తిండం కోసం భతుకుతారు, మరి కొందరు భతకడం కోసం తింటారు.!

గుప్పెడు మెతుకులు దొరకని జీవితం..! 
ఇంతటి దౌర్భాగ్యం అనుభవిస్తున్న వారు ఉన్నారు మన చుట్టూ.
ఆకలి విలువ తెలిసిన వాళ్ళు, ఒక్క మెతుకు కూడా వదల కుండా తినే వాళ్ళు.
కొందరు తిండం కోసం భతుకుతారు, మరి కొందరు భతకడం కోసం తింటారు.!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...! ‘ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ..’ పాటలో బతుకమ్మ.

'ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ..' పాటలో బతుకమ్మ.
'శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై పోదురమ్మా గౌరమ్మా..' భక్తిలో బతుకమ్మ.
రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ.బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ.ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని,సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మనము పడేసే తినే పదార్దాలు మరొకరికి భోజనం అవుతాయి.ప్రతీ ఆరుగురిలో ఒకరు కడుపు నిండా తినరు మరియు ఆకలి చావుకు గురి అవుతారు.

మనము పడేసే తినే పదార్దాలు మరొకరికి భోజనం అవుతాయి.
తినే పదార్దాలను వ్యర్ద పదార్దాలతో కలిపి పడేయకండి.
ప్రతీ ఆరుగురిలో ఒకరు కడుపు నిండా తినరు మరియు ఆకలి చావుకు గురి అవుతారు.
భారతదేశం లో వ్యయసాయం చేసి కాయా కష్టం తో పంట పండించినా, తినలేని దుస్థితి వాళ్ళది. వాళ్ళకి వంట్లో ఉన్న రక్తం, చెమట మరియు కన్నిలే ఆహారం.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అహం పనికిరాదు: అహంభావమే అసలు శత్రువు. 'నేనే గొప్ప', 'నా మాటే వేదం'... అన్న భ్రమలొద్దు.

అహం పనికిరాదు:
అహంభావమే అసలు శత్రువు. 'నేనే గొప్ప', 'నా మాటే వేదం'... అన్న భ్రమలొద్దు. ఎంత పెద్ద అద్దమైనా మనల్ని నూటికి నూరుశాతం ప్రతిబింబించదు. కనిపించని కోణాలూ ఉంటాయి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ప్రేమ అంటే ఏంటో తెలియదు అనేవారికి ఇదో ఉదాహరణ....! నిజమైన అర్ధం ఈ ప్రేమ జంట.

కష్టంలోనూ, సుఖంలోనూ ఒకరినొకరు వదలకూడదన్న పెళ్లి నాటి మంత్రాలకు ...నిజమైన అర్ధం ఈ ప్రేమ జంట.
ప్రేమ అంటే ఏంటో తెలియదు అనేవారికి ఇదో ఉదాహరణ.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

అడగక ముందే సహాయం చేసే వారు దేవతలు ....ఏ జాతిలో వుంటారు మీరు? ఆలోచించండి.

అడగక ముందే సహాయం చేసే వారు దేవతలు 
అడిగితే సహాయం చేసేవారు మానవులు 
అడిగినా సహాయం చేయనివారు రాక్షసులు 
ఏ జాతిలో వుంటారు మీరు? ఆలోచించండి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మట్టిలో కరిగే ప్లాస్టిక్ వాడవచ్చునా ?

మట్టిలో కరిగే ప్లాస్టిక్ వాడవచ్చునా ?

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

తల్లిదండ్రులకు విన్నపము ! by team

తల్లిదండ్రులకు విన్నపము ! by team

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

మట్టిలో కరిగే ప్లాస్టిక్ వాడవచ్చునా ?

మట్టిలో కరిగే ప్లాస్టిక్ వాడవచ్చునా ?

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

ఎవరి ముంధైనా తల ఎత్తుకొని స్థైర్యంగా నిలబడగలిగితే,ఈ ప్రపంచమే నీధవుతింధీ, అలాంటి వాడే నిజమైన మానవుడు.

ఎవరి ముంధైనా తల ఎత్తుకొని స్థైర్యంగా నిలబడగలిగితే,ఈ ప్రపంచమే నీధవుతింధీ, అలాంటి వాడే నిజమైన మానవుడు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...