Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » March 2013
endhaka nee payanam ?

ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటం
చెప్పదుగా ఏ వివరం గగనంలో సంచారం
ఉందా ఉందనుకుందాం ఓ గమ్యం
ఆగేందుకు వీలుందా ఆ వేగంలో
సాగేందుకు దారుందా ఆకాశంలో
బదులేదైనా చెబుతుందా ఏకాంతం
ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటం ?

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

1993 mumbai pellulapai supreme court teerpu

1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు తీర్పు
1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు మార్చి 21న అంతిమతీర్పునిచ్చింది. ఈ దాడులకు కుట్రపన్నిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్‌కు కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. మరో పది మంది నిందితులకు టాడా కోర్టు విధించిన మరణశిక్షను యూవజ్జీవ శిక్షగా మార్పు చేసింది. మరో 25 మందికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడనే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు ఐదేళ్లకు తగ్గించింది. ఈ కేసులో సంజయ్‌దత్ ఇప్పటికే ఏడాదిన్నరపాటు శిక్ష అనుభవించారు. పేలుళ్లకు తెప్పించిన ఆయుధాల కన్‌సైన్‌మెంట్‌లోని ఆయుధాలనే సంజయ్‌దత్ అక్రమంగా పొందాడని కోర్టు నిర్థారించింది. 1993 ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

atyachaara nirodhaka billuku loksabha aamodam

అత్యాచార నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. 'క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013' పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు. మహిళలను వెంటాడటం, శంగారంలో ఉన్న వారిని చూడటం వంటి వాటిని శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించారు. యాసిడ్ దాడులకు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష వంటివి బిల్లులోని ప్రధానాంశాలు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

miss india 2013ga navaneeth koir

మిస్ ఇండియా 2013గా నవనీత్ కౌర్
ఫెమీనా మిస్ ఇండియా -2013గా నవనీత్ కౌర్ ధిల్లాన్ (చండీఘడ్) ఎంపికైంది. ఈ పోటీలో తొలి రన్నరప్‌గా విశాఖపట్నంకు చెందిన శోభితా ధూళిపాళ నిలిచింది. ఈమెను మిస్ ఇండియా ఎర్త్ 2013గా, రెండో రన్నరప్‌గా నిలిచిన జోయా అఫ్రోజ్(లక్నో)ను మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013గా ప్రకటించారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

cheppukoleni baada aa pillalidi..idhi mana rastram lone.

తోటి పిల్లలు తమ బట్టలను గోడగా వాడుతున్నారు ... 
లక్షలు కాదు కొన్ని కోట్ల డబ్బులు దుర్వినియోగం చేసే మన పెద్దవాళ్ళకి ఇవి కనిపించవా ? లేక కనిపించినా చూసి చూడనట్టు వెళ్ళిపోతారా ?

మనసు చేలించింది ఈ చిత్రం చూసి ... ఇంకా ఇలాంటి పరిస్థుతులు ఉన్నాయా అనుకుంటూ ?

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

manchi samethalu telugu lo

మంచి సామెత : 

"ఆటా ముగిసింది, తంతీ తెగింది."

"ఆచారం ముందు,అనాచారం వెనుక." 

"ఆడదే అమృతం,ఆడదే హాలహలం"


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

హైదరాబాద్ మెట్రోకు అవార్డు

హైదరాబాద్ మెట్రోకు అవార్డు
హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)కు 'బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని హెచ్‌ఎంఆర్ ఎండీ ఏవీఎస్ రెడ్డి న్యూయార్క్‌లో జరిగిన ఆరో వార్షిక 'గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్' కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 28న అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల నుంచి హెచ్‌ఎంఆర్‌ను గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఎంపిక చేసింది.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు
గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. బాబ్లీని కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 2.74 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర వినియోగించుకోవాలని సూచించింది. వర్షాకాలమంతా ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని, వర్షాకాలంలో నదీ ప్రవాహానికి అడ్డంకి కల్పించరాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా నీటి పంపకాన్ని పర్యవేక్షించేందుకు ఒకకమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మరొకరు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యవహరిస్తారని చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణపై కమిటీకి దిశానిర్దేశం చేసింది. 1975లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60 టీఎంసీల పరిమితికి లోబడే మహారాష్ట్ర నీటిని వాడుకుంటోందని అభిప్రాయపడింది. పోచంపాడు రిజర్వాయర్ పరిధిలో 0.6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున, అంతే పరిమాణంలో నీటిని మహారాష్ట్ర మార్చి 1న ఏపీకి విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. శ్రీరాంసాగర్ ముంపు ప్రాంతంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో పిటిషన్ దాఖలు చేసింది.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

వరంగల్‌కు ఉత్తమ వారసత్వ నగరం అవార్డు

వరంగల్‌కు ఉత్తమ వారసత్వ నగరం అవార్డు 
జాతీయ పర్యాటక అవార్డుల్లో భాగంగా 2011-12 ఏడాదికిగాను ఉత్తమ వారసత్వ నగరం విభాగంలో వరంగల్ నగరానికి అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వారసత్వ సంపదను కాపాడటం, పర్యాటకరంగ ఉద్యోగులకు నైపుణ్యం పెంచడం, పర్యాటకులకు ఆతిథ్య సేవల విస్తరణ, భద్రతను కల్పించేందుకు టూరిజం, పోలీస్ వ్యవస్థను పటిష్ట పరచడం వంటి అంశాలాధారంగా వరంగల్‌కు ఈ పురస్కారం దక్కింది.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

‘తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం’గా 2013

'తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం'గా 2013
తెలుగు భాష, సంస్కతిని పరిరక్షిస్తూ, భావితరాలకు అందించేందుకుగాను ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల మేరకు 2013ను 'తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం'గా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 14న సాంస్కతికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

తొలి మిహళా తపాలా కార్యాలయం

తొలి మిహళా తపాలా కార్యాలయం
కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా దేశంలోనే తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. అందరూ మహిళలే పని చేయడం ఈ కార్యాలయం ప్రత్యేకత.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

T.B ante enti ? vaati vivaraalu .. టి.బి. (క్షయ) అంటే ఏమిటి?

క్షయ వ్యాధి

టి.బి. (క్షయ) అంటే ఏమిటి?
ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదటు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి.

వ్యాధి లక్షణాలు :

  1. మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
  2. సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
  3. బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
  4. దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది
వ్యాపించే విదానం 
  1. క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి
  2. క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.

నిరోధక చర్యలు :

  1. క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.
  2. దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  3. నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి.జి. టీకా ఇప్పించాలి.

నివారణ చర్యలు 
వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫంప పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి.

కార్యకర్తల విధులు

  • గ్రామంలో గుర్తించబడిన రోగులను తరచూ పరామర్శిస్తూ వారు పూర్తిగా మందులు వాడేటట్లు సమ్మతింపచేయాలి.
  • రెండు నెలలు వాడిన తరువాత వ్యాధి లక్షణాలు తక్కువయితే, వ్యాధినయమైందని మందులు ఆపకుండా చూడాలి. దీనివలన వ్యాధి తీవ్రతరం అవుతుందని హెచ్చరించాలి.
  • పి.హెచ్.సి. సిబ్బంది కాని డిస్ర్టిక్ట్ ట్యూబర్ క్యులోసిస్ సెంటర్ సిబ్బంది కాని అందరు క్షయవ్యాధి రోగులు తమతమ గ్రామం నుంచి క్రమంగా చికిత్స పొందుతున్నారో లేదో కనిపెట్టి ఉండాలి. వీరితో సహకరించాలి.
  • రోగికి పూర్తిగా నయం అయ్యేవరకు నిర్ణయించిన సమయంలో తప్పకుండా కఫం పరీక్ష జరిగేలా చూడాలి.
  • ప్రతి టి.బి. పేషంటు ను రిజిష్టరు చేయించడం, అతని సంబంధిత కుటుంబ సభ్యులకి కఫం పరీక్ష చేయించి ఈ రిజల్ట్స్ కార్డులో నమోదు చేయించాలి.

క్షయవ్యాధి చికిత్స, వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రివైజ్డ్ టి.బి. కంట్రోలు ప్రోగ్రాంని ప్రభుత్వం అమలు పరుస్తోంది


క్షయవ్యాధి రావడానికి గల కారణము ఏమిటి?

క్షయవ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించదు. ఇది ఒక అంటువ్యాధి. ఏ వ్యక్తికైనా క్షయవ్యాధిసోకే ప్రమాదం ఉంది. క్షయవ్యాధి సోకిన రోగి, ముఖ్యంగా వ్యాధి చుఱకైన దశలో వున్నవారు బహిరంగంగా దగ్గినా, తుమ్మినా వ్యాధికి కారణమైన సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తాయి. చుట్టుప్రక్కల ఉన్న ఏ వ్యక్తులైన ఈ క్రిములను శ్వాసద్వారా పీల్చుకోవడం సంభవిస్తే వారికివ్యాధి సోకే అవకాశాలు అధికంగా వుంటాయి.


వ్యాధి లో కనబడే లక్షణాలు ఏమిటి?

విడవకుండా మూడువారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండడం, కాండ్రించడంతో పాటు దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం లేదా ఆకలి తగ్గిపోవడం మొదలైనవి క్షయవ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాల లో ఏవైనా మూడువారాలకు మించి విడవకుండా ఉంటే, ఆవ్యక్తి దగ్గరలో వున్న డాట్స్ టిబి కేంద్రాన్ని లేదా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వారి కఫంని పరీక్ష చేయించుకోవాలి.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

world tb day ప్రపంచ క్షయ వ్యాధి దినం

క్షయ వ్యాధి : అవగాహన

NewsListandDetails

నేడు ప్రపంచ క్షయ వ్యాధి దినం

మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రజారోగ్య ప్రాణాంతక సమస్య క్షయ. ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌క్యులోసిస్‌ అనే సూక్షక్రిమి ద్వారా వ్యాపిస్తుంది. వయస్సు, లింగభేదం లేకుండా ఈ వ్యాధి ఎరికైనా రావచ్చు. క్షయక్రిమికి ఆక్సిజన్‌ అవసరం కనుక ఇది సాధారణంగా ఆక్సిజన్‌ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనిని శ్వాసకోశ క్షయ లేదా పల్మొనరీ టి.బి. అంటారు.
క్షయ వ్యాధి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారిలో ఎక్కువగా ఉంటున్నదని పరిశీలనల్ల వెల్లడైంది.
ప్రపంచంలోని 5వ వంతు క్షయ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. మన దేశంలో రోజూ 5 వేల మంది క్షయ వ్యాధికి గురవ్ఞతున్నారు. సంవత్సరానికి సుమారు 18 లక్షల మందికి ఈ వ్యాధి సోకతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. సగటున రోజుకు 1500 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో సుమారు 1.08 లక్షల మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా.
లక్షణాలు, నిర్ధారణ
ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే క్షయ వ్యాధిగా నిర్దారించవచ్చు. వివిధ దశలనుబట్టి 2 వారాలకు ఇంచి ఎడతెరిపి లేని దగ్గు, సాయంత్రంపూట జ్వరం రావటం, ఆకలి తగ్గడం, ఛాతీలో నొప్పి, బరువ్ఞ తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం, కళ్లె (తెమడ) పడటం, ఆయాసం, త్వరగా అలసిపోవడం, రాత్రిపూట బాగా చెమటలు పట్టడం, నిద్ర పట్టకపోవడం, రోగి అస్తిపంజరంలా మారడం.
క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. సుూరు 95 శాతం దిలో రోగ నిరోధక వ్యవస్థ దీనిపై సమర్థంగా పోరాడి వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. మిగిలిన 5 శాతం దిలో మాత్రం ఇది రూపాంతరం చెందుతుంది. కొందరిలో ఈ క్రిమి నిద్రాణంగా ఉండి, వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడి నప్పుడు - ఉదాహరణకు హెచ్‌ఐవి కారణంగా కాని, పోషకాహార లోపం వల్ల కాని ఇతర కారణాల వల్ల కాని వ్యాధి నిరోధక శక్తి క్షీణించినప్పుడు - విజృంభిస్తుంది.
ఎవరికైనా క్షయ సోకిందనే అనుమానం ఉన్నట్లయితే డిజిగ్నేటెడ్‌ మైక్రోస్కోపీ సెంటర్‌ (డి.ఎం.సి)ల ద్వారా, మన  రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, వైద్య కళాశాలల ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ల కళ్లె, ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు చేస్తారు. ఇటీవలి కాలంలో మందులకు లొంగని మొండి క్షయను గుర్తించడానికి ఖచ్చితంగా నిర్ధారించే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
క్షయ అంటువ్యాధా?
క్షయ తీవ్రమైన అంటువ్యాధి. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గిన ప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు రోగ కారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వదలడం జరుగుతుంది. ఈ సూక్ష్మమైన తుంపర్ల ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చేటప్పుడు వారికి 10 శాతం క్షయ వ్యాపిస్తుంది. చికిత్స ఈసుకోని బాసిలస్‌ క్రిములు కలిగి ఉన్న ఒక క్షయ వ్యాధిగ్రస్తుడు ఒక సంవత్సరంలో కనీసం 10 నుంచి 15 మందికి క్షయ వ్యాధిని వ్యాపింపచేయగలుగుతాడు. కనుక క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గేప్పుడు నోటికి అడ్డుగా ఒక బట్టను పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరాదు.
ఎయిడ్స్‌ దశలో ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశవాద వ్యాధుల్లో క్షయ ప్రధానమైనది. మన దేశంలో హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ బాధితుల్లో సుమారు 50 నుంచి 60 శాతం మంది క్షయ వ్యాధికి గురవ్ఞతున్నారు. క్షయ కారణంగా ఎయిడ్స్‌ సోకిన వారి జీవిత కాలం గణనీయంగా తగ్గుతుంది. ఎయిడ్స్‌ బాధితుల్లో మూడవవంతు వ్యాధిగ్రస్తులు కేవలం క్షయ కారణంగానే మరణిస్తున్నారు.
క్షయ అంటువ్యాధి. కనుక క్షయ వ్యాధిగ్రస్తులు ఇంట్లో ఉన్నంతకాలం, వ్యాధి తీవ్రత తగ్గే వరకూ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు వారి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగిని వేరే గదిలో ఉంచడం, వారికోసం ప్రత్యేకంగా గ్లాసు, ప్లేటు వంటివి ఏర్పాటు చేయడం అవసరం.క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఆరేళ్లలోపు చిన్నారులుంటే, వైద్య సలహా మేరకు వారికి మందులు ఇప్పించాలి.
మన దేశంలో 1962 సంవత్సరంలో క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయింది. తరువాత క్షయ వ్యాధిని నియంత్రించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన స్వల్పకాలిక చికిత్సా విధానాన్ని రూపొందించింది. దీనిని 'డాట్స్‌ (డైరెక్ట్‌లీ అబ్జర్వుడ్‌ ట్రీట్‌మెంట్‌, షార్ట్‌ కోర్స్‌ కీమోథెరపీ) అంటారు. ఈ డాట్స్‌ పద్ధతిలో శిక్ష పొందిన డాట్స్‌ ప్రొవైడర్స్‌ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మొదలైన వారు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న క్షయ వ్యాధిగ్రస్తులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వ్యాధి దశనుబట్టి 6, 7 నుంచి 8, 9 నెలలు చికిత్స అందిస్తున్నారు. మందులను దగ్గర ఉండి వేయడం, వ్యాధి పూర్తిగా నయం అయ్యేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. వ్యాదిగ్రస్తులు క్రమం తప్పకుండా, సరైన మోతాదులో పూర్తికాలం మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవ్ఞతుంది.
క్షయ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ తమ పనులను చేసుకోవచ్చు. క్షయ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.
పాకెర్ల బాబు డేవిడ్‌, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కౌన్సెలర్‌


Very good Article from Vaartha.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Prapancha Neeti Dinochhavam ప్రపంచ నీటి దినోత్సవం

ప్రపంచ నీటి దినోత్సవం Prapancha Neeti Dinochhavam నేడు 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Aksharaalanni kudabetti ...rasaam rastaam raastuneuntaam.

అక్షరాల్ని కూడబెట్టి
భావాల్ని బందీ చేసి
భాషతో గారడీలాడడమే కవిత్వం.
రాయడం మనకలవాటైంది
అందుకే ఆకలేసి కేకలేసినా
ఆ నక్షత్రాలు అదిరిపడ్డా
కడుపునింపని కవిత్వాన్ని
రాసాం రాస్తున్నాం రాస్తూనే ఉంటాం....!!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

vaanaku tadichina puvvokati raalipadindi baavilo..!

vaanaku tadichina puvvokati raalipadindi baavilo..!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...