Is this blog?

భారతీయులం

భారతీయులం |protest of indians, we are indians
Home » 2012
ee kotha samvachharam udayam nenu chesina manchi pani..!

కొత్త సంవత్సరం ఉదయం..!
ఈ కొత్త సంవత్సరం లో నేను ఓహ్ ఆవు కి తోచిన ఆహారం తో ప్రారంబించాను... ఉదయం నిద్రలేచాకా సూర్యుడిని చూడటానికి బయటికి వెళ్ళగానే ఎదురుగా ఒక ఆవు కనిపించింది. ఎందుకో వెంటనే అమ్మ ని అడిగి ఆవుకోసం మొక్కజొన్న మరియు అరటి పండ్లు ఇంకా దొండ కాయలు కొన్ని మరియు రేనికాయలు పెద్దవి ... పెట్టాను అది మంచి ఆకలితో ఉంది అనుకుంటా, శుబ్రంగా తిని తల నిర్ముతు ఉంటే సంతోషంగా ఉనట్టు ఉంది...తల నిర్మడం ఆపగానే తల ఎత్తి మెడ చూపిస్తుంది..! కాసేపు సమయం కేటాయించి తరువాతవ పోప్పాయి తెచ్చి దానికి పెట్టి పో ఇక అనగానే వెళ్ళిపోయింది.
మంచి ఆవు..! 

ఆవు శాకాహారి జంతువు. ఇది కేవలం గడ్డి, లేగా మొక్కలకు సంబందించిన ఎటువంటి ఆహారానయినా భుజిస్తుంది. 

గోవధను నిషేధించండి
హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు కాబట్టి గో రక్షణకు చట్టం తీసుకురావాలని, ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని,గోవధను నిషేధించాలని కోరుతూ హిందూమత పెద్దలు ఎనిమిది కోట్ల సంతకాలతో కూడిన ఓ వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు సమర్పించారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

telangaana charitra telusukundam needu..


తెలంగాణ చరిత్ర తెలుసుకుందాం !

చరిత్ర జ్ఞానం లేని వాడు చరిత్ర హీనుడవుతాడు. అందుకే అందరికీ చారిత్రకాధ్యాయనం అవసరం. 

పదిహేను కోట్ల మంది తెలుగువారి చేత రెండువేల ఏండ్ల చరిత్ర గల తెలంగాణా సంస్కృతిని తప్పనిసరిగా నేర్పేటట్లు విద్యాశాఖామాత్యులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రపంచానికి బృహత్కథను అందించిన పైశాచీ ప్రాకృత మహాకవి గుణాఢ్యుడు కరీంనగర్‌ జిల్లాకు చెందినవాడు. శ్రీకృష్ణుని భార్య రుక్మిణీ దేవి కూడా ఉత్తర తెలంగాణాకు చెందిన మహనీయురాలు. శాతవాహనుల రాజధానులలో కరీంనగర్‌ ప్రాంతం కూడా ఉన్నట్లు కొందరి అభిప్రాయం. తెలివాహపై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఆ విషయం మరీ విస్తరించటం లేదు. గాథాసప్తశతిలోని చాలా శర్లకాలు గోదావరి తీర ప్రాంతంలోనే పుట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు త్రిలింగదేశం అనిపిలిచేవారు. అందులో ఒక సరిహద్దు కరీంనగర్‌ జిల్లాలో ఉంది. ఇవన్నీ చారిత్రక సత్యాలే. మార్కోపోలో భారతదేశ పర్యటన చేస్తూ వరంగల్లు వచ్చారు. అప్పుడు రుద్రమదేవి పరిపాలిస్తున్నది. ఈమె రాజ్యంలో రత్నాలు, వజ్రాలు వీధులలో కుప్పలు పోసి అమ్ముతున్నారని వర్ణించారు. ఐతే అంతటి వైభవం కూడా రెండవ ప్రతాప రుద్రునితో అంతరించింది. అందుకు కారణం మాలిక్‌ కాఫర్‌ పరాక్రమంతో బాటు తెలంగాణాలోని అంత: కలహాలు. గోనగన్నారెడ్డి వంటి వీరులను కాకతీయులు ఆదరించారు. రెడ్లకు ప్రాధాన్యత నీయటం వెలమ దొరలకు నచ్చలేదు. అందువల్ల వారు మాలిక్‌ కాఫర్‌తో కాకతీయులు చేసిన యుద్ధంలో సహకారం అందించలేదు. ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. 

ఆ తర్వాత కాపీయ నాయకుడు ప్రోలయ నాయకుడు అనే ఇద్దరు కమ్మ ప్రభువులు తిరిగి తెలంగాణాను శత్రువుల నుండి విముక్తం చేసి కాకతీయ సామ్రాజ్యలక్ష్మికి తిరిగి మామిడాకు తోరణాలు కట్టారు. ఐతే తెలంగాణా తిరిగి ఏడు వందల సంవత్సరాలు ముస్లిముల చేతనే పరిపాలింపబడింది. బానిసను దొరా -నీ కాళ్లకు మొక్కుతా -అని అట్టడుగు వర్గాలకు చెందిన సామాన్యులను ఈ ప్రభువులు బానిసతనాన్ని నేర్పారు. రాచకొండకు చెందిన సర్వజ్ఞ సింగభూపాలుడు పోతనగారు రచించిన భాగవతాన్ని చెరబట్టాడు. ఫలితంగా నేటికీ పోతన భాగవతంలో చాలా అధ్యాయాలు మనకు దొరకటం లేదు. ఈ దొరగారి కథ తెలుగువారందరికీ తెలుసు.

పాల్కురికి సోమనాథుడు వీరశైవుడు. తెలంగాణా తురుష్కమయం కాబోతున్నది అని తెలిసి కర్నాటకకు వెళ్లి కల్వ అనే ప్రాంతంలో పరమపదించాడు. ఇప్పుడు కన్నడిగులు పాల్కురికి సోమనాధుడు, బసవేశ్వరుడు మావాళ్లు అని చెప్పుకుంటున్నారు. ఇది నిజం కాదు, పాల్కురికి సోమనాథుడు తెలంగాణా ప్రాంతంవారు. బసవేశ్వరుని పూర్వీకులు గుంటూరు జిల్లాకు చెందినవారు.

అసఫ్‌ జాహీలు కళాప్రియులు. ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించారు. హైదరాబాద్‌ -నగరం ముస్లింలు ముస్లింల కోసం నిర్మించుకున్నారు. మాసాబ్‌టాంక్‌ (అంటే రాణీగారు త్రవ్వించిన చెరువు). రాణిగంజ్‌, అంటే రాణీగారి ప్రదేశం, బీగం బజార్‌ వంటివి ముస్లిం రాణుల షాపింగ్‌ ప్రాంతాలు. చూడీబజార్‌ అంటే గాజులు అమ్మే ప్రాంతం. కోఠీ అంటే ఇంగ్లీషు దొరగారి నివాసస్థానం. తెలంగాణాలో దేవాలయాలు చాలా అధ్వాన్నదశలో ఉండేవి. తెలుగు మాట్లాడితే తప్పు. రామాయణ, భారత నాటకాలు ప్రదర్శిస్తే అరెస్టు చేసేవారు. రోషనారా నాటకాన్ని నిషేధించారు. ఈ వివరాలేవీ ఈతరం వారికి తెలియవు. 1947 లో రజాకార్లు స్థానిక హిందువులను చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ప్రాణరక్షణకై బాపట్ల, పందిళ్లపల్లి, విజయవాడ వంటి ప్రాంతాలకు వలసపోయారు. నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌, కాశింరజ్వీల ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని కెసిఆర్‌ కోరటం నిజంగా సంతోషింపదగ్గ విషయం. ప్రజలకు తప్పనిసరిగా చారిత్రక జ్ఞానం ఉండాలి. మా పూర్వీకులకు కాకతీయ మహారుద్ర దేవరాజు ముదిగొండ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. అది దేవరకొండ (నల్గొండ) జిల్లాలో నేటికీ ఉంది. ఐతే మాలిక్‌ కాఫర్‌ దండయాత్రల తర్వాత ఇక్కడి నంది విగ్రహాల మూతులు పగలగొట్టారు. ఆలయాలు నేలమట్టమైనాయి. అబుల్‌ హసన్‌ తానీషా వంటి మతసహనం గల కొందరు రాజులు భద్రాద్రి రామునికి తర్వాతి కాలంలో కైంకర్యం చేయించినట్లు, కూచిపూడి నర్తకులకు అగ్రహారాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. స్థానికంగా షియా -సున్నీ శాఖల మధ్య అంత:కలహాలు ఉండేవి. కాకతీయుల కాలంలో తెలంగాణ సరిహద్దులు కాంచీపురం (తమిళనాడు) వరకు వ్యాపించాయి. ముస్లిం పాలకులకు గుంటూరు, కర్నూలు ప్రాంతాలవారు గోల్కొండ వచ్చి కప్పం కట్టిపోయేవారు. స్థానిక పటేల్‌, పట్వారీలు, దొరలు సాగించిన పరిపాలనా వైభవం తెలుసుకోవాలంటే దాశరథి రంగాచార్య గారి చిల్లర దేవుళ్లు జనపదం చదవండి -రజాకార్ల చరిత్ర తెలుసుకోవాలంటే వందేమాతరం వీరభద్రరావు, రామచంద్రరావు గార్ల గ్రంథాలు అధ్యయనం చేయండి. ఇంకా ఆదిరాజు వీరభద్రరావు, బి.ఎన్‌.రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి గార్ల గ్రంథాలూ పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఈ చిన్న వ్యాసాన్ని విద్యార్థులు రాజకీయ నాయకులూ అందరూ అధ్యయనం చేయండి. ''మా నిజాము రాజు తరతరాల బూజు'' అన్న దాశరథి కృష్ణమాచార్యుల వారి అగ్నిధార, రుద్రవీణ పాఠ్య గ్రంథాలుగా పెట్టండి. ఎందుకంటే ఇవి చారిత్రక పరిశోధనా విషయాలను తెలియజేస్తాయి. నేటి ప్రత్యేక తెలంగాణా సమైక్యాంధ్ర ఉద్యమాలలో ఈ వ్యాసానికి ఎట్టి సంబంధమూ లేదు. వానమామలై వరదాచార్యులవారు రచించిన మేఘవలయము తెలంగాణా ప్రాంతం వారే కాక మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పెట్టించండి. తెలంగాణా శబ్దం త్రిలింగ శబ్దోద్భవం. కాకతీయులను త్రిలింగ దేశాధిపతులు అని పిలిచేవారు. ఈ త్రిలింగములలో ఒకటి కరీంనగర్‌ జిల్లాలోను, రెండవది తూర్పు గోదావరి జిల్లాలోను, మూడవది కర్నూలు జిల్లాలోను ఉన్నాయి. కాకతీయులు మొదట జైనులు తర్వాత శైవులు. ప్రతాపరుద్ర యశోభూషణము రచించిన విద్యానాథుడు అప్పకవీయము (ఛందోగ్రంథము) రచించిన అప్పకవి తెలంగాణా ప్రాంతంవారే. తెలగాణ్యులు, గోల్కొండ వ్యాపారులు అనే శాఖలు నేటికీ బ్రాహ్మణులలో ఉన్నాయి.

నిజాం కాలేజీని రాజుగారు తమ కోసం, రాజోద్యోగుల బిడ్డలకోసం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరం 3 లక్షల మంది కోసం ప్లాన్‌ చేయబడింది. 200 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఏనుగుల వీరాస్వామిగారి ''కాశీయాత్ర'' చదవండి. ఆ రోజుల్లో వనపర్తి, దోమకొండ, గద్వాల వంటి సంస్థానాలుండేవి. వారు ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకున్నారు. వారి కళాసాంస్కృతిక సేవ కూడా గణనీయమైనదే. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అందువల్ల ఉస్మాన్‌ ఆలీఖాన్‌, కాశింరజ్వీ, షాబుల్లాఖాన్‌, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పాల్కురికి సోమనాథుడు, అబుల్‌ హసన్‌ తానీషా, కంచెర్ల గోపన్న, కులీకుతుబ్‌షా, చెర్విరాల నాగయ్య, కొమరం భీం వంటి వారిపై పాఠ్యాంశాలు పెట్టాలి.

మంచి -చెడూ అన్నీ చారిత్రక ప్రామాణ్యాలతో పాఠకులకు పరిశోధక విద్యార్థులను అందించాలి. 1830లో ఏనుగుల వీరాస్వామి అనే మద్రాసు వాసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి కాశీవెళ్తూ హైదరాబాద్‌ వచ్చాడు. అంటే నేటికీ 200 సంవత్సరాల నాటి గోల్కొండ రాజుల పాలన ఎలా ఉండేదో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పీర్లపండుగ వైభవంగా జరిగినట్లు వర్ణించాడు. హిందువులు ఇవ్వాళ హైదరాబాద్‌లో గణశ్‌ ఉత్సవాలు దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో జరుపుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో హిందువులు పండుగలను రహస్యంగా నేలమాళిగ (అండర్‌ గ్రౌండ్‌)లలో గణశ, హనుమాన్‌ విగ్రహాలు పెట్టి జరుపుకునేవారు. నేటికీ పాతబస్తీలో కొన్ని దేవాలయాలు భూగర్భంలో ఉండటం గమనార్హం. ఇదీ ఆనాటి తెలంగాణా.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

merugaina chattaalu amaluloki vastayani aashistu..happy new year.

కనీసం ఈ కొత్త సంవత్సరం లో నైనా మెరుగైన చాట్టాలు అమలులోకి వస్తాయని ఆశిస్తూ..!
అందరికి ఈ క్రొత్త సంవత్సరం లో మంచి జరగాలని కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

nutana samvachhara shubhakankshalu ... gadichina kaalam manaku vishaadanni panchindi kani.

గడచిన కాలం మనకు సంతోషాన్ని, విషాదాన్ని పంచి ఉండొచ్చు!
కానీ కొత్త సంవత్సరం కొత్త ఆశలను మరియు ఆశీస్సులతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ.
భారతీయులం వీక్షకులకు మరియు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సర్వేజనా: సుఖినోభవంతు - m&k

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Free online prepaid mobile recharge just get it and invite. its funny and try it.

మీరు ఇంటర్నెట్ లో డబ్బులు ఎలా సంపాదించాలి అంటూ ఆలోచిస్తున్నారా ?
రోజు రోజు ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉంది ఈరోజుల్లో...ఐతే తొలి ఇండియన్ వెబ్సైటు ఒకటి డబ్బులు సంపాదించడానికి ఎఅర్న్ ఫ్రీ మొబైల్ రిచర్జ్ అండ్ ఎఅర్న్ అంటూ మొదలు పెట్టింది.
వివరాల కొరకు ఈ లింక్ చూడండి.
http://goo.gl/J6KIi
రిజిస్టర్ అయినందుకు రెండు రూపాయిలు ఇస్తారు మొదట.
ప్రతి రోజు లాగిన్ మరియు స్నేహితులకు చేర్చినందుకు ఒక్కరుపాయీ ఇస్తారంట.
Click here: http://goo.gl/J6KIi

Recharge it now by playing an interesting game. You can recharge all prepaid mobile phones for free. Get Rs. 10, Rs. 50 & Rs. 100 easy mobile recharge (as available with your mobile operator).
Free mobile recharge worth thousand's of rupees is given away everyday to our users.Join now (it's free) and get yourself free online prepaid mobile recharge.


Thinking how to get money online?
You can earn money online fast by playing games and referring friends.
You will get paid for every game you play and for every friend who joins on your invite.
You will have fun and earn money too - Join now (joining is free)

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Please don't let the struggle go vain...Let the government know why we are here.

అందరికి పేరు పేరునా  కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ! 
కాని మన పాలకులకు అది అర్ధం కావడం లేదు అనుకుంటా ?
ఎవరికీ వారు తమ నోటి కి పని చెప్తున్నారు.... సిగ్గుపడేలా !
దయచేసి నాయకుల్లారా ఎలా జనాలు మిమల్ని చాలా తక్కువగా నమ్ముతారు..ఆ కొంచం నమ్మకాన్ని కూడా మీ మాటలతో పోయే లా చేసుకోకండి.
ఇది మేము మా లోని కోపాన్ని వ్యక్తపరుస్తున్నాము...ఆ మానవ మ్రుగాలపైన...ఎందుకంటే మీ నాయకత్వం ఎక్కడ వాడికి శిక్ష పడకుండా వదిలేస్తుందో అన్న బయం.
మన రాజదాని లోనే ఒక స్త్రీ కి ఇంత గోరం జరిగితే ఇంక వేరే చోట ఎలా ?
మనము ఢిల్లీ లో జరిగే వాటిగురించి తెలుసుకోవచ్చు ఇక్కడ. 

Please don't let the struggle go vain...Let the government know why we are here.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

chemical-castration-for-one-who-raped

మొత్తానికి అనుకున్నదే జరగబోతుంది....ఆ మానవ మృగాలకు..కెమికల్ క్యాస్త్రేషణ్ చేయాలి అని కాయం అవ్వబోతుంది.

కెమికల్ క్యాస్త్రేషణ్...ఇది అమలు లోకి వస్తే మన దేశం లో మృగాలకు సరైన గుణపాటం జరుగుతుంది.

కెమికల్ క్యాస్త్రేషణ్ వల్ల కొన్ని లాబాలు మరి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ఈ కెమికల్ వల్ల వాళ్ళ శరీరం లో కొన్ని కణాలు చనిపోతాయి ....సెక్స్ కణాలు లాంటివి.

మరియు ప్రాణాలు హరించే లాగా కూడా జరగవచ్చు ఒక్కొకసారి..యముకల డెన్సిటీ తగ్గి మరియు బరువు పెరిగి కొవ్వు ఎక్కువవుతుంది దానివల్ల వాళ్ళకి చాలా రొగాలకి గురి అయ్యేలా చేస్తుంది కుడా..! మెల్లగా చంపడం అంటే ఇదేనేమో.

అసలు కెమికల్ క్యాస్త్రేషణ్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి. http://goo.gl/8gJ2a


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Population in states of India..telusukovachhu ikkada.

మన రాష్ట్ర జనాబా ఎంత తెలుసా మీకు ?
మన దేశం లో ఉన్న రాష్ట్రాల జనాబా వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
మన రాష్ట్రం ది ఐదవ స్థానము... మొత్తం జనాబా 82,180,000 మంది సుమారుగా.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Step Out ! and Raise Your Voice. Join the hands lets make a peace rally for Nirbhaya.

కదలిరండి ..కదలిరండి.!
తలదించుకు బతుకుతావా ..తలెత్తుకొని తిరగలెవా ?
తలరాత మార్చుకోవ ? నిద్ర లేచి రారా !
తోలి మనిషి ఎప్పుడు ఒక్కడే గా...తోలి అడుగు ఎప్పుడు ఒంటరే గా....! కదలిరా...కదలిరా !

Let's Stop the Violence, Real Men Don't Rape, Stop Violence Against Women.

Step Out ! and Raise Your Voice.

Come and join the tribute to the girl at hyderabad - 7pm.

Let he soul rest in peace - A walk to remember.

From around the world, Indian's are paying tribute to the Nirbhaya.

Join TV9: Near Ambedkar Statue, Tank Bund to pay tribute 7pm tonight on Dec 29,2012. - m&k

Join the hands lets make a peace rally.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

global public dept as on dec 29 2012 telusa meeku. Debt of Rs.41061/- per person in India.

ప్రపంచ బ్యాంకు లో మన అప్పు ఎంత ?
మొత్తం దేశాల నుండి రావాల్సినది ఎంత డబ్బో తెలుసా మీకు  ?
49ట్రిలియన్... ఇంత బారి మొత్తం ప్రపంచ జనాబా నుండి రావాలి ప్రపంచ బ్యాంకు కు, ఐతే మన దేశం పరిస్త్థితి ఏంటో తెలుసుకుందామా !
మన దేశం కి ఉన్న అప్పు $1,001,289,617,486 దాదాపు ఒక ట్రిలియన్ డాలర్స్ .
ప్రతీ ఒక్కొక్క మనిషి మీద ఉన్న అప్పు...$821.22 దాదాపు Rs.41061/- నలబై ఒక్క వెయ్యి రూపాయిలు సుమారు.
మన ప్రస్తుత జనాబా సంక్య 1,219,901,639 మంది. Dec 29,12 నాటికి.
ఇంకా వివరాలకు ఈ లింక్ ని చూడండి ! http://goo.gl/SLIhB

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Delhi gang-rape: Justice Verma Committee The written responses may be sent to the committee by way of email or fax

ఆరిపోయింది దీపం.
12రోజులు మృత్యు పోరాటం చేసి అలసిపోయిన గుండె.

Delhi gang-rape: Justice Verma Committee

The committee, headed by former Chief Justice of India J S Verma, which had invited suggestions from members of the public.
The three-member committee was set up following the widespread anger across the country over the brutal gang-rape of a 23-year-old girl in Delhi on the night of December 16 by six men in a moving private bus.

The other members of the committee are Ms Justice (Retd) Leila Seth, former Chief Justice of Himachal Pradesh HIgh Court, and Mr Gopal Subramaniam, former Solicitor General of India.
 
The release said that the committee, at its meeting today, took note of the way forward. It appealed to all members of the public who are interested in making any suggestions to do so without any reservations before January 5.

In the event there are persons who would like, for personal reasons, that their identity be kept confidential, they may clearly indicate so, the release said.
The written responses may be sent to the committee by way of email (to justice.verma@nic.in) or by fax (to 011-23092675). 
 
"The committee interprets the Terms of Reference as wide enough to include connected areas such as gender justice, respect towards womanhood, and ancillary matters,"

The committee has been asked to submit its report within 30 days.

Get Download the Document and Print and Spread.
For More Visit: bharatiyulam.blogspot.com and Feedback us: bharatiyulam@gmail.com

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

asalendukilaa jai telangaana jai samaikyandra jai raayalaseema.. ee vadanalanni. telisindi cheppandi teliyani vaariki teliyajeppudaam.

అసలెందుకిలా ?
జై తెలంగాణా జై సమైక్యాంద్ర జై రాయలసీమ )
రోజు రోజుకి మన రాష్ట్రంలో పరిస్థితి అయోమయం గా మారింది.
ఏది సరైన నిర్ణయం తెలియక సతమత మవుతున్న జనాలు..మరియు మాటలు చెప్పే నాయకులు.
కాని ఎ నిర్ణయం తేసుకున్నా ఏంటి నష్టం ఏంటి లాబం ?
అసలెందుకిలా ? ఎందుకు ఏమిటి ఎలా ?
ఎన్నో సందేహాలు ఎన్నో ఆలోచనలు...వకరి తరుపు వారిని మరొకరు దుషించకుండా ..
అని అలోచించి తెలుసుకుందాం తెలుపుదాం అందరికి.
ఇది ఏ  ప్రాంతీయవారిని ఉద్దేశించింది కాదు...కేవలం వ్యక్తి గత బావం తెలుసుకుందాం అని మాత్రమే.
Please, Be an Optimist and let's know each other what we know about the situation and place of living.
అసలెందుకు ఈ సమైక్యాంద్ర  వాదన ?
అసలెందుకు ఈ తెలంగాణా వాదన ?
అసలెందుకు ఈ రాయలసీమ వాదన ? ఇతర వాదనల్లని.
అసలు మనకి అభివృద్ధి ఎలా వస్తుంది ? అసలు ఈ రాజకీయనాయకులు చెప్పే మాటల్లో నిజం ఎంత ?
ఎంతవరకు మీ వాదన లో స్పష్టత ఉందొ చెప్పగలరా ? ప్రజలకి ఎంతవరకు తెలుసు ? ఎంత చెప్పారు మీరు.
నిజానికి సమైక్యాంద్ర ఎందుకు అంటున్నారో ? తెలంగాణా ఎందుకు అంటున్నారో ? రాయలసీమ ఎందుకు అంటున్నారో ? అయోమయ పరిస్థితి.
తప్పులు వొప్పులు అందరు తెలుసుకోవడం చాలా ముక్యం. మనకు తెలిసింది నలుగురితో పంచుకోవడం మరియు తెలియజేయడం లో తప్పు లేదు.
ఒక్కసారి నిజంగా మీకు ఎంతవరకు తెలుసు ఈ వాదనల గురుంచి ? ఆలోచించండి అసలెందుకిలా అని.
మనకి ఏం తెలుసు ? ఎంతవరకు తెలుసు ?
ఇది మన సమస్య ..మనమందరం తెలుసుకోవడం మన హక్కు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

aa ori lo mobile phone lo matladina leda evarikaina call chesina jarimana vidistaru telusa.

ఆ ఊరు లో మొబైల్ లో మాట్లాడినా లేదా ఎవరికైనా కాల్ చేసినా జరిమానా బారి మొత్తం లో కట్టాలి తెలుసా మీకు.
ఈ చట్టం కేవలం వివాహిత మరియు అవివాహిత ఆడవారికి మాత్రమే. సుందర్ బరి పంచాయత్, కిషన్గంజ్ డిస్ట్రిక్ట్.
జరిమానా 10,000 అవివాహిత మహిళకు మరియు 2,000 వివాహిత మహిళకు.
మొత్తం ఊరి జనాబాలో 90% మంది పంచాయతి పెట్టిన సమావేశానికి హాజరు అయ్యారు...అక్కడి సర్పంచ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కూడా వెల్లడించారు. "ఆరుగురు అమ్మాయిలు లేచిపోయారు ఇంటి నుండి గడిచిన నలుగు ఐదు నెలల వవది లో...అందువల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

World Internet Users Stats- Internet to Grow Larger in Year 2013

With 2.4B global Internet users in 2012, KPCB (Kleiner Perkins Caufield Byers) expects the growth to increase a t the rate of 8% (Year on Year Growth Rate), driven by emerging markets such as India, Indonesia, Iran, Russia and Philippines.

What Stats Says About Internet

internet users in world 2012 2013

Internet Usage Statistics 2012 2013


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Make Your Gmail Hack Proof & Robust Using Two-Step Verification

Your Gmail account's password isn't just for Gmail. Gmail's password is shared by all the other Gmail applications such as Google Docs, youtube etc. So when it comes to secure your Gmail password extra concern must be taken. Gmail provides you a unique password verification feature that makes your Gmail password more robust and hack proof. This feature is known as "Two-Step Verification." This feature allows you to enable two step account verification process before your login to your Gmail account. Once you login to your Gmail account using this feature, Gmail enables you to login with the same PC for next 30 days without any verification. (this feature is optional). Two-Step Verification allows you to login from selected PCs into your Gmail account.

As per Google, 2-step verification adds an extra layer of security to your Google Account.  Besides, your username and password, you'll have enter an unique code to sign in to your Gmail account. This uniques code will be generated to your cell phone via text or a voice message once you initiate signing process.

Let us learn how to secure your Gmail account and add Two-Step Verification

How to Set up Two-Step Verification:

  • Login to your Gmail account.
  • Go to your Google Account Settings.
  • On the Account Settings page, search for "2-Step Verification" and click "edit" option to turn it on.
  • Before you proceed further, please have your cell phone/mobile with you and ready.
  • You need to set up your mobile phone to receive unique codes via SMS text message or through a voice call over your mobile phone. You can also download the app and use over your cell phone, if you have a smart-phone (app enabled cell phone).
  • Complete the next few steps to register your mobile phone for Two-Step Verification. Gmail will verify your mobile phone by sending SMS text message. Enter the code to verify your mobile phone.

Once this feature is enabled, to access your Gmail you will always require the password, and Gmail unique code that will be delivered to you via your cell phone.  If you wish Gmail to remember your computer for login, (so that it doesn't asks u to verify Two Step Verification for next consecutive 30 days)  check the option that says "remember me for 30 days on this device"

Even if you lost your cell phone or you don't have your cell phone with you, you can use Two Step Verification and easily login to your Gmail account. Google offers multiple ways to generate Two Step Verification codes. You can add a secondary backup phone or you can print the single-use verification codes.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Mobile Application for Women Safety First time in India.

ఒక కొత్త యాప్స్ ఒకటి ఆడవాళ్ళ కోసం చేసారు...
ఆ యాప్స్ పేరు ఫైట్ బ్యాక్ ..ఈ యాప్స్ మనము ఎంచుకున్న ముక్యమైన వాళ్ళందరికీ బటన్ క్లిక్ తో మనము ఉన్న స్థలము వివరాలు జి పి ఎస్ ద్వారా తెలుసుకొని ఎంచుకున్న వాళ్ళకి ఎస్ ఎమ్ ఎస్ పంపుతుంది అంట అత్యవసర సమయం లో.
ఈ యాప్స్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉచితముగా పొందవచ్చు మరియు మిగతా వారు 100రూపాయిలు 12నెలలకి సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
ఇది అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పారు.

India's first Mobile Application for Women Safety.
FightBack, the women's safety application, sends SOS alerts from your phone. FightBack uses GPS, SMS, location maps, GPRS ,email and your Facebook account to inform your loved ones in case you are in danger. Join us and help make our streets safer for women. 

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

tananu taanu samskarinchukunna vyakthike itharulanu samskarinche adikaaram andutundi.

తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

bharatiyulam veekshakulaku Christmas Shubhakankshalu.

భారతీయులం వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. - m&k

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

manaku telisindi konchum teliynadi anantham

మనకు తెలిసింది కొంచం తెలియనిది అనంతం !

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

vinayam leni vidya sugunam leni rupam...vyardamainavi.- swami vivekananda.

వినయంలేని విద్య,
సుగుణం లేని రూపం,
సుదుపయోగం కాని ధనం,
శౌర్యంలేని ఆయుధం,
ఆకలి లేని భోజనం,
పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి.- స్వామీ వివేకానంద

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

men helpline center number for distressed men.

మగవారికి కుడా కొన్ని కష్టాలు ఉంటాయి ...
మగవారిని వేదించే ఆడవాళ్ళూ కుడా లేకపోరు.
మగవాళ్ళు తమ బాధలకు పరిష్కరించుకోవడానికి కొన్ని సంస్థలు కుడా ఉన్నాయి..ఇవి మీకోసం.
Help Line Toll Free: 91-80-56969850

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

Women protection cell and helpline numbers in Hyderabad Telusaa Meeku.

Women protection cell and helpline numbers in Hyderabad

* Women protection cell – 040 -23240663, 040-23320539
* Women police station – 040-27853508
* Child rights – 1800 425 2933
* Roshini helpline – 040-66202000
* Asmitha resource center for Women – 040-27733251
* Shaheens women's organization – 040-24386994
* AP women's network – 040-27014394
* Child line – 1098, 040-23133550
* State Human Rights Commission – 040-24601571, 24601572, 24601574
* Human rights law network – 040-27661883
* Crime stopper – 1090
* Anti corruption wing – 040-24720196, 24720197
* Satyam helpline for health – 1056, 104
* Alchoholism rehabilitation center – 040-65969896, 9849940500
* Divya disha – 9848186982
* Prajwala (human trafficking) – 040-65704048
* Sweekar upkar for disabled – 040-27814089
* National Commission for Women – 011-13237166
* Helpline for senior citizens – 1253
* Anveshi – 040-27423690
* Ankuram – 040-27017446
* Sannihita Ms.Usha – 9246573978
* ALEAP (self employment) – 040-23893644
* Bread organization (For Educational support) – 040-65887177
* BHUMIKA Women's collective – 040-27660173
* BHUMIKA HELPLINE FOR WOMEN IN DISTRESS – Toll free number – 1800 425 2908/ 040-2765316


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

protest on rape by sending email or fax and women helpline number 181

ఎవరికైనా చెబితే చంపేస్తా..అని బెదిరించి బాలికను(12) మూడుసార్లు  అత్యాచారం చేసాడు ఓహ్ కీచకుడు(28).
(18)ఏళ్ల యువతిపై ఆమె స్నేహితుడు అత్యాచారం చేసి అనంతరం హతమార్చబోయాడు...
ఆ మనవ మృగాలకు కటిన శిక్ష పడేలా చూదాం.
మన చట్టాల పనితీరుని మార్చుదాం...కటినంగా శిక్షించేలా చేయాలి.

ఆమె మృత్యు పోరాటం..! డిల్లి లో జరిగినది.
ఆమె మీద జరిగిన గోరమైన అత్యాచారం పై ...రగులుతున్న యువ శక్తి మరియు సమాజం, తను మాత్రం చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది.
ఈ నేరం కి  చేసిన  నిందుతులకి ఉరి శిక్ష విదించడమే సమము అని మీరు కుడా బావిస్తున్నారా !
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి కి సూచనలను ఈమెయిల్ లేదా ఫ్యాక్ష్ పంపించవచ్చు.

Email: justice.verma@nic.in & Fax No: 011-23092675

మహిళా సమస్యలు, వేదింపుల పై ఎవ్వరైనా ఏ  సమయంలోనైనా సుదీర్ యాదవ్ వ్యక్తిగత సెల్ నెంబర్ కు - 9818099012 ఫోన్ చేసి సహాయం కోరవచ్చని ప్రకటించారు.
 మహిళలకు సహాయంగా 181 హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసారు.
మన వంతు సాయం తో న్యాయం జరిగేలా చూదాం.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

aadapilla pudutundantene gundello vanuku...ela penchali, ela chadivinchali, katnaalu...antu.

ఆడపిల్ల పుడుతుందంటే గుండెల్లో వణుకు. ఆడపిల్లను పెంచలేమని, చదివించలేమనీ, కట్నాలుపోసి పెళ్లి చేయలేమనీ, జాగ్రత్తగా కాపాడలేమనీ ఇలా ఆడబిడ్డను పురిట్లోనే హతమార్చడానికి ఎన్నో కారణాలు. స్త్రీని దేవతగా, ఆకాశంలో సగభాగంగా కొలిచే నేటి భారతంలోనే ఈ ఘాతుకాలు జరగడం సిగ్గుపడాల్సిన విషయం. అతివ అడుగు ముందుకేస్తున్న కొద్దీ అణిచివేయడం గర్హించదగిన అంశం.

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు అత్యాచారాలపై మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఒక పక్క దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా నివారించాలో అలోచించలేక 'ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు' అంతా ఒకే మాట.

అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ అవటం వలననే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని స్వయాన పశ్చిమబెంగాల్‌ మహిళ ముఖ్యమంత్రి మమతబెనర్జీ అనటం సిగ్గుచేటు. అధికార పార్టీ ప్రతినిధి రేణుకాచౌదరి అత్యాచారాలు శాంతి భద్రతల సమస్య కాదని అన్నారు. హర్యానా ముఖ్యమంత్రి అయితే ఏకంగా 16సం||లకే అమ్మాయిలకు పెళ్ళి చేయడం వలన అత్యాచారాలను నియంత్రించవచ్చని బాల్యవివాహాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. వీటిని బట్టి అమ్మాయిలపై రాజకీయ నాయకులలో ఎలాంటి దృక్పథం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పశ్చిమబెంగాల్‌, హర్యానాలలో ఒక్క నెలలోనే 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2011లో అమ్మాయిలతో అనైతిక వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మన రాష్ట్ర పోలీస్‌ లెక్కలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం చిల్డ్రన్స్‌ ఇన్‌ ఇండియా 2012 నివేదికను విడుదల చేసింది. దీనిలో దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలను (పోలీస్‌ స్టేషన్‌లో నమోదయిన కేసులు మాత్రమే) నివేదించారు. ఈ నివేదికలో ఇవి కొన్ని అంశాలు మాత్రమే..

మైనర్‌ బాలికలపై జరుగుతున్న అకృత్యాలలో ఎ.పిలో అధికం

* అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలలో అత్యధికంగా 605 కేసులు నమోదు కాగా అనైతికంగా అమ్మాయిలతో వ్యాపారం చేయించే కేసులు 497 అత్యధికంగా కేసులు ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలకు భద్రత ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది.

* మైనర్‌ బాలికలను బంధించడం కేసులలో 27% పెరిగాయి. వీటిలో పశ్చిమ బెంగాల్‌ (298)లో 34.6%తో అగ్రస్ధానంలో ఉంది. తర్వాతి స్ధానాల్లో బీహర్‌(183), అస్సాం(142), ఆంధ్రప్రదేశ్‌్‌(106) ఉన్నాయి.

* బాల్యవివాహాలలో దేశం మొత్తం మీద 113 కేసులు నమోదు కాగా అధికంగా పశ్చిమబెంగాల్‌ (25) తర్వాతి స్ధానాల్లో మహారాష్ట్ర(19), ఆంధ్రప్రదేశ్‌(15), గుజరాత్‌(13), కర్ణాటక(12) ఉన్నవి.

పశ్చిమబెంగాల్‌లో అధికారం మారిన తర్వాత అమ్మాయిలపై అకృత్యాలు బాగా పెరిగాయి. మహిళ ముఖ్యమంత్రి అయినా ఆమ్మాయిలపై నేరాలు పెరిగాయే కాని తగ్గలేదు. అయినా ఆమ్మాయిలదే నేరం అన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడటం శోచనీయం.

* వ్యభిచార వత్తిలో దింపేందుకు అడపిల్లలను కొనడం, అమ్మడం నేటికీ పలు రాష్ట్రాల్లో యధేచ్ఛగా కొనసాగుతోంది. 2010 సం||తో పోల్చితే 2011లో వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు అమ్మాయిలను కొనడం 65%, అమ్మడం 13% పెరిగింది.

* ఈ తరహా నేరాల్లో అడపిల్లలను కొనడంలో అధికంగా మహారాష్ట్రలో 74% కేసులు నమోదయ్యాయి. అడపిల్లలను అమ్మడంలో అధికంగా పశ్చిమబెంగాల్‌లో 77% కేసులు నమోదయ్యాయి.

>అత్యాచార కేసులలో...

* 2010-11 అత్యాచార కేసులు 30%, అమ్మాయిలను బంధించడం 27% కేసులు పెరిగాయి. 2011 సం|| బాలికలపై అత్యాచారాలలో ముందు స్ధానంలో మధ్యప్రదేశ్‌ తర్వాతి స్ధానాల్లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలలోనే 44.5% కేసులు నమోదయ్యాయి.

భ్రూణహత్యలలో...

* ఆడపిల్ల పుడుతుందని తెలిసి భ్రూణహత్యలకు పాల్పడుతున్న కేసులు కూడా పెరిగాయి. దేశం మొత్తం మీద 132 కేసులు నమోదు కాగా అధికంగా మధ్యప్రదేశ్‌లో నమోదవ్వగా, చత్తీస్‌గడ్‌, పంజాబ్‌ ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.ఈ మూడు రాష్ట్రాల్లోనే 56% కేసులు నమోదయ్యాయి.నమోదయిన కేసులలో న్యాయస్ధానాలకు వెళ్ళి శిక్షలు పడుతున్నవి అతి తక్కువగా ఉంది.

శిక్ష విధించడంలో అలసత్వం

* పిల్లలపై నేరాలు పెరుగుతున్నప్పటికి వాటిపై కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం కనబడుతుంది. నమోదైన కేసులలో శిక్షలు పడిన వారు తక్కువే. కేవలం 34.6% కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నవి.

* చిన్నారుల హత్యలకు 45.5%, భ్రూణహత్యలకు 46.9% కేసుల్లో శిక్షలు పడినట్లు నివేదికలో పొందుపరిచారు. అమ్మాయిల క్రయవిక్రయాలలో 65% కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 20.4% కేసులు 2011సం||లో నమోదయ్యాయి.122.2% కేసులు అమ్మాయిల ఎగుమతులపై నమోదు కాగా వాటిలో 56% కేసులు మధ్యప్రదేశ్‌లో నమోదవడం విశేషం.

* కేసులు నమోదుచేసి వాటిపై చార్జీషీటు నమోదు చేయడంలో మాత్రం వెనుకడుగే. 2011 సం||లో 82.5% కేసులకు మాత్రమే చార్జీషీటు నమోదు చేశారు. అతి తక్కువగా భ్రూణహత్యలపై నమోదు కావటం శోచనీయం.

...పై వివరాలను బట్టి దేశంలో అమ్మాయిలకు ఎలాంటి భద్రత ఉందో అర్ధం అవుతుంది. అందుకే మొట్టమొదటి సారిగా యునెస్కో, యు.ఎన్‌.ఓ ప్రపంచ బాలికల దినోత్సవాన్ని జరపాలని డిసెంబర్‌ 2011న నిర్ణయించాయి. అక్టోబర్‌ 11న ఈ దినోత్సవాన్ని జరపాలని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వెడుకను అన్ని దేశాలు ఏదోఒక రూపంలో జరుపుకున్నాయి. భారతదేశంలో కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొన్నారు. యునెస్కో భారతదేశానికి బాల్యవివాహాలను రద్దుచేయడానికి పూనుకోవాలని సందేశం పంపింది. ఇదే అక్టోబర్‌ 11న హర్యానా ముఖ్యమంత్రి 16 యేళ్ళలోపే బాలికలకు వివాహాలు చేయాలని ప్రకటించారు. హర్యానాలోని పంచాయితీ పెద్దలు కూడా బాల్య వివాహాలను జరపడం వలననే అమ్మాయిలపై అత్యాచారాలను అరికట్టగలమని ప్రకటించాయి.ఈ రాష్ట్రంలో ఒక్క నెలలోనే 15 అత్యాచార కేసులు నమోదయ్యాయి అంటే పరిస్ధితి అదుపు తప్పుతుందని అర్ధం అవుతుంది.. మన ఆంధ్రప్రదేశ్‌ బాల్యవివాహాలలో మూడవ స్ధానంలో ఉంది. జనాభాలో అమ్మాయిల శాతం తగ్గటం వలన ఇలాంటి అకృత్యాలు పెరుగుతున్నాయని ఐద్వావంటి మహిళా సంఘాలు చెబుతున్నా భూృణహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది.

సమాజంలో అమ్మాయిలపై ఉన్న దృక్పథంలో మార్పు రావాలి. అధునిక కాలంలో ఆమ్మాయిలు మేము సైతం అని అన్ని రంగాలలో అభివృద్ధి అవుతున్న దశలో ఇలాంటి చేష్టలు తిరోగమనానికి ఆనవాళ్లు. కాబట్టి మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. పెచ్చరిల్లుతున్న ఈ విషసంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత నేడు ఆసన్నమైనది.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

telugu kaiku baath karnaa..baatkarnaa jarurat hai kya ? ey bekar hai.!!

ఆనాడు ప్రజా సంభాషణల్లో, ప్రభుత్వ విభాగాల్లో, పాలనా వ్యవహారాల్లో ఎక్కడా కానరాదు తెలుగు.
బతికించుకున్నారు ....
తెలుగు పై నిజాం పాలకుల వివక్షకు అడ్డుకట్ట.
తెలుగు కైకు బాత్ కర్నా...బాతకర్నా జారురత్ హై  క్యా ? ఏ బేకార్ హై !!


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

delhi rape maruvaka munde marokati mumbai lo jarigindi...stop rape and punish them.

గోరం క్రూరం 
డిల్లీ లో జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే ముంబై లో మరో టి జరిగింది...!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

gunde mandutunda meeku...telusukondi idhi meekosam.

గుండె మండుతుంది..!

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mee balam baadinchadaniki kaadu aapandi maapai laingika himsa..

అత్యాచార ఘటనపై పెల్లుబలికిన ఆక్రోశం.
మీ బలం బాదించడానికి కాదు...ఆపండి మాపై లైంగిక హింస.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

mukkoti ekadasi...chala baga raasaaru teluguvaramandi vaaru.

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

chellani nanem ..telugu. rupaaye nanallo kanumarugaina mana vaibhavam.

చెల్లని నాణెం....తెలుగు ?
రూపాయి నాణాల్లో కనుమరుగైన మన వైభవం...బ్రిటిష్ కాలంలో అగ్రస్థానం.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam

మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!

భారతీయులం |bharatiyulam, bharatiyulam.blogspot.com
Related Posts Plugin for WordPress, Blogger...